ప్రియమైన మిత్రులారా ,
గుండె లోతులో నుంచి గుర్తు తెచ్చుకుందామా....
ఆ నాటి మన సంక్రాంతి సంతోషాలు
తెల తెల్ల వారు జామున కుర్రతనం జోరులో
వేసిన బోగి మంటల వెచ్చని జ్ఞాపకాలు !!!!
ముద్దు గుమ్మాలు .... ముంగిట వేసిన ముద్దోచే రంగుల..... ముగ్గులో గొబ్బియలు
డూ డూ బసవన్న చే గంగి రెడ్దుల చెప్పించే ..అమ్మ వారికీ , అయ్యా వారికీ ..జే జే లు
చేతికొచ్చిన పంటల దాన్యలతో సిరి సౌబాగ్యలు....
ఇంటికి వచ్చిన అల్లులు కు అందే మర్యాదలు
వంటింటిలో అరిసెలు , అటక ఫై సున్నుండలు , జేబులో జంతికలు ....తిన లెన్నని పిండివంటలు.
చాటు మాటున పెద్దలు వేసే కోడి పందాలు .....ఆకాశానికి పోటిగా పిల్లల వేసే గాలి పటాలు
హరిదాసుల గానాలు ....అడిగిన ప్రతి వారికీ... లేదనకుండా దక్కేను అన్న పానీయాలు
ఇలా ఎన్నని చెప్పిన ఆనందం తరుగని .....ఆ నాటి సంబరాల సంక్రాతి ....
కానీ...... నేడు లేదు...ఈ పండుగ రోజున .... రైతు మోములో కాంతి.
ఎందుకంటే
పల్లెటులే దేశానికి పట్టు కొమ్మలు అన్న బాపూజీ..... కలలు కన్నమన స్వరాజ్యం
టూ జి , త్రి జి అంటూ లెక్క లెన్నని కుంబ కోణాలకు ....
అవినీతి అక్రమాలకు అయితే సామ్రాజ్యం.
ప్రకృతి వైపరిత్యాలు , నకిలీ విత్తనాలు , రాజకీయ నాయకుల వాగ్దానాలు
అడుగడుగునా అన్న దాతను మోసం చేస్తూ క్రుంగ దీస్తూ ఉంటె ..
.
మట్టిని నమ్మిన రైతన ...బరువెక్కిన గుండెతో ...
అందరి నేరానికి తను ఉరి కంబం ఎక్కలిసివస్తుంది.
ఓ రైతన్న
ప్రతి రోజు వార్త పత్రికలో , టి వి చానలో వినిపించే నీ మరణ వార్త ...
ఈ జనానికి అలవాటు అయిపోయింది .
కానీ వెయ్యి కోట్లకు అధిపతి అయిన ...నీవు పండించే గింజ తినే బతకాలి అన్న సత్యం
మరిచిన వాళ్ళకి ....తినడానికి అన్నం దొరకని రోజున నీ విలువ తెలిసి వస్తుంది.
పరిస్థితి ఇలాగె కొనసాగితే .........నాకు తెలిసి అప్పటికి నీవు ఉండవు అని పిస్తుంది .
."జై కిసాన్ "అన్న లాల్ బహుదూర్ శాస్త్రి గారి ఆత్మ సాక్షి గ ...
నీ కోసం మా మనసు ఏదో చేయాలి అని తపిస్తుంది.
మేము సంక్రాతి పండు గ తిరిగి చేసుకో లేక పోయిన పర్లేదు ...
కానీ నీ జేవితం లో అశాంతి పోయి ...నీ మోమున కాంతి చూడాలి
అదే మా కందరికీ నిజమయిన సంక్రాతి !!!!!
తపనతో ,
శ్రీ తపన
కల్మషం ఎరుగని మనుషులకు , నీతి నిజయితలకు ప్రతికలు ..పల్లెటూలు....
ఆ పల్లెటూలు కు ....అన్నదాత రైతన్న కు ఈ నా కవిత అంకితం
No comments:
Post a Comment